భారతదేశ రక్షణ రంగ అభివృద్ధిలో మరో కీలక అడుగు వేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సమీపంలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) కేంద్రంలో డ్రోన్ నుంచి క్షిపణిని ప్రయోగించి విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతమైనదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) ప్రకటించారు.

దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్షిపణి
ఈ క్షిపణిని పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేశారు. దీనిని యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (ULPGM)-V3గా పిలుస్తున్నారు. ఇది మానవరహిత విమానాల (డ్రోన్) ద్వారా ప్రయోగించదగిన ప్రత్యేకమైన గైడెడ్ క్షిపణి వ్యవస్థ.
DRDO, MSMEs, స్టార్టప్ల పాత్రపై అభినందనలు
ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో పాటు, ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్లు చేసిన కృషిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు. ఇది సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశం పూర్తిగా అర్థం చేసుకుని నిర్మించగల సామర్థ్యం కలదని ఆయన చెప్పారు. ఈ క్షిపణికి సంబంధించిన సాంకేతిక వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గతంలో ప్రయోగించిన యూఎల్పీజీఎం-వీ2 (ULPGM-V2) ఆధారంగా ఈ వేరియంట్ను అభివృద్ధి చేసినట్లు సమాచారం.
కర్నూలులో పరీక్షల కేంద్రంగా మారిన ఎన్ఓఏఆర్
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని డీఆర్డీవోకు చెందిన ఎన్ఓఏఆర్ పరీక్ష కేంద్రాన్ని దీని కోసం ఎంచుకున్నారు. గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఇదే వేదికను ఉపయోగించారు. ఈ ఆయుధం ఫిక్స్డ్వింగ్ మానవరహిత విమానాలను కూల్చివేయడానికి ఉపయోగిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 30 రోజుల సెలవులు!