అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో విషాదం మరింత బరువెక్కింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం (Dr. Komi Vyas’s family) మొత్తం మృతి చెందింది. ఇది గుండెను తట్టే సంఘటనగా మారింది.డాక్టర్ కోమి వ్యాస్ పసిఫిక్ ఆసుపత్రిలో ప్రముఖ డాక్టర్గా సేవలందించారు. ఆమె భర్త ప్రదీప్ జోషితో కలిసి లండన్లో కొత్త జీవితం మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్నారు. ముగ్గురు పిల్లలతో కలిసి గతవారం ఉద్యోగానికి రాజీనామా చేశారు. రెండు రోజులకే లండన్కు పయనం ప్రారంభించారు. కానీ అది చివరి ప్రయాణమయ్యింది.
ఫ్లైట్ కూలిపోతే.. ఆశలన్నీ నాశనమయ్యాయి
విమాన ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే, అది కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో వారంతా ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంతో కలిసి బయట ప్రపంచంలో అడుగుపెట్టే ప్రయత్నంలో ఉన్న వారు.. అర్థంతరంగా విడిచి పెట్టినట్టు జరిగింది.
స్నేహితుల స్పందన – కన్నీటి సందేశాలు
ఈ వార్త తెలుసుకున్న కోమి స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కోమి తన జీవితాన్నే మార్చేందుకు వెళుతోంది. ఆమె భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి లండన్లో కొత్త అధ్యాయం ప్రారంభించాలనుకుంది. కానీ జీవితం మలుపు తిప్పింది, అంటూ సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
జీవితంపై ప్రశ్నలు వేసే విషాదం
రాజస్థాన్లోని బన్స్వారా ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం.. భవిష్యత్ కలలతో ముందుకెళ్లాలనుకున్న సమయంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరికీ కలచివేసింది. కొన్ని సార్లు జీవితం ఎంత అస్పష్టంగా ఉంటుందో ఇది సాక్ష్యం, అంటూ నెటిజన్లు సంతాపం తెలిపారు.
Read Also : Milan Airport : ఎయిర్పోర్టులో కిందపడి డొల్లుతూ మహిళ గోల