📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: Rajasthan: రాజస్థాన్‌లో రోడ్డు రౌద్రం – 18 మంది మృతి!

Author Icon By Radha
Updated: November 2, 2025 • 11:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్థాన్‌లోని(Rajasthan) ఫలోడిలో(Phalodi) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మటోడా గ్రామ సమీపంలో టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనంలో ప్రయాణిస్తున్న వారు జోధ్‌పూర్‌కు చెందిన భక్తులు. వీరంతా బికనీర్ జిల్లాలోని కొలాయత్ ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read also: Prashant Varma: ఫిర్యాదులపై ప్రశాంత్ వర్మ స్పందన!

రాత్రివేళ వేగంగా ప్రయాణిస్తున్న టెంపో డ్రైవర్ ముందున్న ట్రైలర్‌ను గమనించకపోవడంతో ఢీ కొట్టాడు. ఢీకొన్న తీవ్రతకు టెంపో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందీ, పలువురు ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. స్థానికులు, ఇతర వాహనదారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీయడానికి సహాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

సీఎం భజన్ లాల్ స్పందన – గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం

రాజస్థాన్(Rajasthan) ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రులకు తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబాలకు పూర్తి సాయం అందించడంతో పాటు చికిత్సలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ భద్రతా చర్యలను బలోపేతం చేయాలని కూడా సీఎం సూచించారు.

ప్రమాదం ఎక్కడ జరిగింది?
రాజస్థాన్‌లోని ఫలోడి సమీపంలోని మటోడా గ్రామంలో ప్రమాదం జరిగింది.

ఎన్ని మంది మరణించారు?
మొత్తం 18 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

highway safety India News Phalodi Crash Rajasthan road safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.