రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్లోని విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సూపర్ గ్యాస్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా,అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Nellore Murder Case: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు
పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పేలుడుకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.ఈ ఘటనతో ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: