Rajasthan: రాజస్థాన్లోని అల్వర్ జిల్లా ఖుష్ఖేడా పరిశ్రమల ప్రాంతంలో సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ప్లాట్ నంబర్ G-1, 118లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటనతో ప్రాంతమంతా దిగ్భ్రాంతికి గురైంది.
Read Also: History Of Bus: బస్సును ఎవరు కనిపెట్టారో తెలుసా?
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Firefighters) పలువురు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫ్యాక్టరీలో రసాయన పదార్థాలు లేదా దహనశీల వస్తువులు నిల్వ ఉండటం వల్లే మంటలు వేగంగా వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక భద్రతా ప్రమాణాల లోపమా? అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో అగ్నిమాపక పరికరాలు సరిగా పనిచేశాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: