Telugu News:Railway sports:ఆల్ ఇండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం

Read Time:  1 min
Railway sports
Railway sports
FONT SIZE
GET APP

తార్నాక (హైదరాబాద్) : రైల్వే స్పోర్ట్స్(Railway sports) ప్రమోషన్ బోర్డ్ (ఆర్.ఎస్.పి.బి) ఆధ్వర్యంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసి యేషన్ 47వఆల్ ఇండియా రైల్వే కబడ్డీ (మహిళలు) ఛాంపియన్ షిప్ పోటీలను ఈ నెల 7నుండి 10 అక్టోబర్ వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే అదనపు జన రల్ మేనేజర్ సత్యప్రకాష్ మంగళవారం సికిం ద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్(Railway sports) అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, స్టోర్స్ వర్క్షాప్ పి. కోటేశ్వరరావు ఇతర సీనియర్ రైల్వే అధికారులు మరియు క్రీడా సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు.

Read Also :Jishnu Dev Varma: టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలి

Railway sports

ఈ సంవత్సరం సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, నార్త్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్కెస్ట్ రైల్వే మరియు ఆత్నిథ్య వహి స్తున్న సౌత్ సెంట్రల్(South Central Railway) రైల్వేలకు సంబందించిన మొత్తం తొమ్మిదిజట్లు ఈ పోటీలో పాల్గొంటు న్నాయి. ఈ టోర్నమెంట్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయి ఆటగాళ్ళు పాల్గొంటారు. తొలి నాకౌట్ ప్రారంభ మ్యాచ్ దక్షిణ మధ్య రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణ మధ్యరైల్వే 48 పాయింట్లు సాధించి విజే తగా నిలువగా, నార్త్ ఈస్టర్న్ రైల్వే 25 పాయిం ట్లు సాధించింది. ఈ సందర్భంగా సత్య ప్రకాష్ మాట్లాడుతూ ఛాంపియన్షిప్లో పాల్గొనే జట్ల కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి నిజమైన క్రీడా స్ఫూర్తి, నిబద్దత మరియు కృషిని ప్రదర్శించాలని ఆయన పాల్గొనే వారిని ప్రోత్సహించారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.