ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (Indian Railway Recruitment Board) (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల (Major notification released) చేసింది. 2025-26లో దాదాపు 50,000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది బంపర్ అవకాశం.ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే RRB 9,000 మందికి ఉద్యోగ నియామక లేఖలు పంపింది. నవంబర్ 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 55,197 పోస్టులకు ఏడుసార్లు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
CBT పరీక్షలతో రికార్డు స్థాయిలో అభ్యర్థులు
ఈ నోటిఫికేషన్ల కింద 1.86 కోట్లకు పైగా అభ్యర్థులు CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాశారు. ఇదే కాకుండా, 2024లో మొత్తం 12 నోటిఫికేషన్ల ద్వారా 1,08,324 పోస్టులకు ప్రకటనలు విడుదలయ్యాయి.CBT పరీక్షలు పెద్ద ప్రాసెస్ అయినందున, రైల్వే మంత్రిత్వ శాఖ విస్తృత ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అభ్యర్థుల ఇళ్లకు దగ్గరగా పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
2026-27లో మరోసారి 50,000కు పైగా ఉద్యోగాలు
2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ RRB మరో 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. వార్షిక క్యాలెండర్ ప్రకారం ఇదే దిశగా సూచనలు కనిపిస్తున్నాయి.ఈసారి అభ్యర్థులను గుర్తించేందుకు ఆధార్ ఆధారిత e-KYC విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది 95% వరకు విజయవంతమైంది. పరీక్షల నిష్పక్షపాతతను మెరుగుపరచేందుకు ప్రతి కేంద్రంలో జామర్లను అమర్చుతున్నారు.
పరీక్షలు పారదర్శకంగా, న్యాయంగా
ఎలాంటి మోసాలు జరగకుండా చూడటం కోసం కొత్త భద్రతా విధానాలను అమలు చేస్తున్నారు. CBT పరీక్షలు పూర్తిగా న్యాయంగా, పారదర్శకంగా జరగేలా చర్యలు తీసుకుంటున్నారు.ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. సిద్ధమవుతూ, నోటిఫికేషన్కు అనుగుణంగా అప్లై చేయడం ద్వారా మంచి భవిష్యత్కు దారి పడుతుంది.
Read Also : Gokarna Cave : గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ