Rail Development: 2030 నాటికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ

Read Time:  1 min
Rail Development
Rail Development
FONT SIZE
GET APP

దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల(Rail Development) సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడంతో పాటు రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా 2030 నాటికి రైల్వే సామర్థ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించింది.

Read also: BhakraNangal: 75 ఏళ్లుగా ఉచితంగా నడుస్తున్న భారతదేశపు ఏకైక రైలు

Rail Development
Rail Development: Expansion of the railway network by 2030

తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం

ఈ ప్రణాళికలో భాగంగా దేశంలోని 48 ప్రధాన నగరాల్లో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. కొత్త రైలు మార్గాలు, అదనపు ట్రాక్‌లు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థల ద్వారా రైళ్ల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించనుంది. దీని ద్వారా రద్దీ తగ్గి, సమయపాలన మెరుగవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

రాబోయే ఐదేళ్లలో మెట్రో నగరాలు(Rail Development) మరియు ప్రధాన వ్యాపార కేంద్రాల్లో స్టేషన్‌లను ఆధునీకరించడం, ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేటింగ్ హాల్స్, డిజిటల్ సేవలు, మెరుగైన భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు. అంతేకాకుండా నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసి ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఈ అభివృద్ధి జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ నగరాల్లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి జరగడం వల్ల స్థానికులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందనున్నాయి. ఈ చర్యలతో రైల్వే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారుతుందని, దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.