📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

జేపీ నడ్డాకు రాహుల్ గాంధీ లేఖ!

Author Icon By Sukanya
Updated: January 20, 2025 • 5:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పౌరులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడానికి ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయిల వరకు ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సూచించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డాకు లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజారోగ్య సదుపాయాలను బలోపేతం చేయడం అవసరమని చెప్పిన రాహుల్, భారతదేశంలో ఉన్న పెద్ద వైద్య సంస్థలు ఎలా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో వివరించారు.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వెలుపల రోగులు అనుభవిస్తున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేసాయని రాహుల్ పేర్కొన్నారు. ఎయిమ్స్ ఎదుట శీతాకాలంలో వందలాది రోగులు మరియు వారి కుటుంబాలు తగిన సదుపాయాలు లేక బాధపడటం చూసినట్టు ఆయన తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు లేకుండా రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఈ పరిస్థితి పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తాత్కాలికంగా పారిశుద్ధ్య సదుపాయాలు, మంచి నీరు మరియు ఆశ్రయం వంటి కనీస మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సదుపాయాలను మరింత త్వరగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయికి ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పెద్ద మొత్తంలో రోగులకు ఉపయోగం ఉంటుందని చెప్పారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌ను ప్రజారోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

aiims Google news JP Nadda public healthca rahul gandhi Union Health Minister

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.