📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Rahul Gandhi – ‘ఓట్ల దొంగతనం’పై ఆధారాలతో గుట్టురట్టు: రాహుల్ గాంధీ

Author Icon By Rajitha
Updated: September 18, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపులు, దొంగతనాలు జరుగుతున్నాయి అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చి పెద్ద బాంబు పేల్చారు. ఎన్నికల సంఘం సాక్షాత్తూ ఈ కుట్రకు రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ వివరించిన ప్రకారం, కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఏకంగా 6,000కి పైగా ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నం జరిగింది. ఇది అనుకోకుండా బయటపడిన ఒక ఉదంతమని, ఇలాంటి ఎన్నో సంఘటనలు మిగిలి ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.

వ్యక్తి పేరిట నమోదు అయ్యిందని

ఓటర్ల జాబితాలో పేర్లు ఎలా తొలగిస్తున్నారో ఉదాహరణతో వివరించారు. ఒక బూత్ లెవెల్ అధికారి బంధువు పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో విచారణ జరిపారు. రికార్డుల్లో ఆ ఓటు (votes) తొలగించడానికి దరఖాస్తు పొరుగు వ్యక్తి పేరిట నమోదు అయ్యిందని తేలింది. అయితే ఆ వ్యక్తి తానే ఆ దరఖాస్తు చేయలేదని చెప్పడంతో అసలు వ్యవహారం బయటపడిందని రాహుల్ వివరించారు. ఈ ఘటనను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ, “ఓటు తొలగించిన వ్యక్తికీ తెలియదు, ఓటు పోగొట్టుకున్న వ్యక్తికీ తెలియదు. మధ్యలో ఉన్న గోప్యమైన శక్తులే ఈ ప్రక్రియను హైజాక్ చేస్తున్నాయి” అని మండిపడ్డారు.

Rahul Gandhi

రాహుల్ హెచ్చరించారు.

బీజేపీపై, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ (Commissioner Gyanesh Kumar) పై ఆయన నిప్పులు చెరిగారు. “సీఈసీ స్వయంగా ఈ కుట్రకారులకు రక్షణ కల్పిస్తున్నారని” రాహుల్ ఆరోపించారు. ఇదే ఆరంభం మాత్రమేనని, త్వరలోనే మరింత బలమైన ఆధారాలు – తాను ‘హైడ్రోజన్ బాంబ్’ (Hydrogen bomb) అని పిలుస్తున్న సాక్ష్యాలు బయటకు తీసుకువస్తానని రాహుల్ (Rahul Gandhi) హెచ్చరించారు. ఈరోజు చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు నిజం త్వరలో దేశ ప్రజలకు తెలుస్తుందని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏంటి?
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా వ్యవస్థీకృతంగా ఓట్ల దొంగతనం జరుగుతోందని, దీనికి ఎన్నికల సంఘం రక్షణగా నిలుస్తోందని ఆరోపించారు.

ఆయన ఎక్కడ ఉదాహరణ చూపించారు?
కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నం జరిగినట్లు ఉదాహరణ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/england-vs-ireland-first-t20-win-salt-89/sports/549613/

Breaking News cec gyanesh kumar Election Commission Karnataka Aland latest news rahul gandhi Telugu News vote theft voter fraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.