📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Rahul Gandhi: రాహుల్ గాంధీ కేసులో స్టే పొడిగించిన సుప్రీంకోర్టు

Author Icon By Sudha
Updated: November 20, 2025 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భార‌తీయ సైన్యంపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్య‌ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2022 భార‌త్ జోడో యాత్ర‌లో ఆర్మీపై రాహుల్ (Rahul Gandhi) అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ కేసులో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్‌, స‌తీశ్ చంద్ర శ‌ర్మ‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును ఇవాళ విచారించింది. ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాల‌ను కొట్టివేయాల‌ని కోరుతూ మే 29వ తేదీన అల‌హాబాద్ హైకోర్టును రాహుల్ ఆశ్ర‌యించారు. అయితే ఆ స‌వాల్‌ను హైకోర్టు తిర‌స్క‌రించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్ర‌యించారు.

Read Also : http://Pending bills: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం పై సుప్రీం సంచలన తీర్పు

Rahul Gandhi

స‌రిహ‌ద్దుల‌ను చైనా ఆక్ర‌మించిన‌ట్లు గ‌తంలో రాహుల్ ఆరోపించారు. అయితే ఆ కేసులో ఆగ‌స్టు 4వ తేదీన సుప్రీంకోర్టు విచార‌ణ చేస్తూ.. 2 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణం ఉన్న భార‌త భూభాగాన్ని చైనా ఆక్ర‌మించిన‌ట్లు ఎలా చెబుతున్నార‌ని ప్ర‌శ్నించింది. ఆ ఆక్ర‌మ‌ణ స‌మ‌యంలో మీరున్నారా, మీ ద‌గ్గ‌ర ఏదైనా న‌మ్మ‌ద‌గ్గ స‌మాచారం ఉందా అని కోర్టు అడిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నార‌ని కోర్టు ప్ర‌శ్నించింది. కాంగ్రెస్ నేత త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Court Case India Politics latest news Legal Updates rahul gandhi Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.