తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కీలక ప్రక్రియపై కేంద్రం స్పందించకపోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీసీల రిజర్వేషన్లు పెంచుతూ పంపిన బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.అహ్మదాబాద్లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశ సమస్యలను పరిష్కరించాలంటే దేశానికి ఎక్స్రే అవసరం అని అన్నారు.దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలు సామాజిక విభజనతో సంబంధమున్నవే అన్నారు. దళితులు, ఆదివాసీల హక్కులు పట్టించుకోవడంలో కేంద్రం విఫలమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి సమస్యలు పరిష్కారానికి కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు.తన తర్వాత ప్రజలు తాను చేసిన సేవలను గుర్తుంచుకోవాలనేది తన ఆలోచన కాదన్నారు. తాను నమ్మిన పనిని పూర్తిగా పూర్తి చేస్తే చాలు అని చెప్పారు.

తెలంగాణలో కులగణన విజయవంతమైందని రాహుల్ అన్నారు. అదే ఆదారంగా రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. బీసీల అసలైన జనాభా ఎంతో తెలుసుకోవాలంటే కులగణన తప్పనిసరి అన్నారు.తెలంగాణ ఈ విషయంలో దేశానికి దారి చూపిందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం అన్న నిబంధనను తొలగిస్తామని స్పష్టం చేశారు.ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను బేరం పెడుతున్నారని ఆరోపించారు. అవి కేవలం ఇద్దరు వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్తున్నాయని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమ పద్ధతులు పాటించిందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై పెద్ద దాడి అని వ్యాఖ్యానించారు.ఆరెస్సెస్, బీజేపీలు నిత్యం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. దేశానికి అసలైన గతి సాధించాలంటే ప్రజల కళ్ళు తెరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.