ఓట్ల చోరీ (vote chori)పై నిర్వహించిన ప్రెస్ మీట్తో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. దేశంలో ఓట్ల చోరీపై ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్లో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ఆయన రక్షిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. కర్ణాటకలోని ఆలంద్, మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రెస్ మీట్లో ఓట్లు ఎలా చోరీకి గురవుతున్నాయో వివరిస్తూ ఓ ఫోన్ నంబర్ ను రాహుల్ (Rahul Gandhi) ప్రదర్శించారు. అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కు చెందిన అంజనీ మిశ్రా అనే వ్యక్తి ఫోన్ నంబర్. రాహుల్ ప్రెస్ మీట్ తర్వాత ఆ నంబర్కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై అంజనీ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ (Rahul Gandhi)ప్రెస్ మీట్ తర్వాత దేశం నలుమూలల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నట్లు చెప్పారు. ఆ ఫోన్ నంబర్ను తాను 15 ఏళ్లుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఓటరు తొలగింపుకు సంబంధించి తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదని వివరించారు. ప్రెస్ బ్రీఫింగ్ లో రాహుల్ తన నంబర్ను ప్రస్తావించడం చూసి షాక్ అయినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అంజనీ మిశ్రా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
రాహుల్ గాంధీ లోక్ సభ పదవి?
భారత జాతీయ కాంగ్రెస్ (INC) సభ్యుడైన ఆయన ప్రస్తుతం లోక్సభలో 12వ ప్రతిపక్ష నాయకుడిగా మరియు జూన్ 2024 నుండి ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలికి లోక్సభ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
రాహుల్ గాంధీ రాజకీయ జీవితం?
రాహుల్ గాంధీ 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి చంద్ర ప్రకాష్ మిశ్రాపై 390,179 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాహుల్ గాంధీ 2009లో జరిగిన లోక్సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి ఆశిష్ శుక్లాపై 464,195 ఓట్లతో మెజారిటీతో గెలిచి రెండోసారి, 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో 408,651 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 1,07,903 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: