📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Rahul Gandhi: రాహుల్ గాంధీ తో పాటు పలువురు నేతలు అరెస్ట్

Author Icon By Sharanya
Updated: August 11, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలోని పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ర్యాలీకి అనుమతి నిరాకరణ – పోలీసుల అడ్డగింపు

ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వరకు చేయాలని ప్రయత్నించారు. అయితే, పోలీసులు దీనికి అనుమతి లేదని స్పష్టం చేస్తూ కూటమి నేతలను ఆపారు. దీంతో పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.

ఎన్నికల అవకతవకలపై నిరసన

ఈ ర్యాలీకి నేపథ్యం – లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వ్యవస్థపై తమ అనుమానాలను వివరించేందుకు, చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఎన్నికల సంఘాన్ని కలవాలనుకున్నారు.

బారికేడ్లు దాటి నిరసన

ఎన్నికల సంఘం భేటీకి 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, “మేమంతా కలిసే వెళతాం” అంటూ ఎంపీలు పట్టుదలగా ముందుకు సాగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటి రోడ్డుపై బైఠాయించారు. దీంతో, వారిని పోలీసులు ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు

ఈ అరెస్టులతో దేశ రాజధానిలో రాజకీయ వేడి పెరిగింది. విపక్షాలపై ప్రభుత్వం దుర్బల చర్యలు తీసుకుంటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విపక్షాలు మండిపడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/supreme-court-street-dogs-removal-order/national/528897

Arrest Breaking News congress Congress protest latest news Leaders Arrested Political News rahul gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.