Rahul gandhi news : లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడిందనే వ్యాఖ్యలు తాను స్వయంగా చేయలేదని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని భారత సైన్య మాజీ చీఫ్ మనోజ్ నరవణే తన పుస్తకంలో రాసారని తెలిపారు. ఆ పుస్తకం వెలుగులోకి వస్తే అసలు నిజాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో కేంద్ర ప్రభుత్వం ప్రచురణను అడ్డుకుంటోందని ఆరోపించారు.
లోక్ సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలను సభలో లేవనెత్తేందుకు తాను ప్రయత్నించినా మాట్లాడనివ్వడం లేదని చెప్పారు. సరిహద్దు పరిస్థితులు, సైన్యానికి ఎదురైన ఇబ్బందుల గురించి ప్రజలకు నిజాలు తెలియకుండానే ప్రభుత్వం దాచిపెడుతోందని విమర్శించారు.
Read Also: Mumbai: రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్
నరవణే రాసిన పుస్తకం బయటకు వస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సైన్యంపై పడిన ప్రభావం బయటపడుతుందని, అందుకే కేంద్రం ఆందోళన చెందుతోందని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రత అంశాలపై పారదర్శకత అవసరమని, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: