📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

బడ్జెట్‌పై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే స్పందన

Author Icon By Sukanya
Updated: February 1, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం 2025 కేంద్ర బడ్జెట్‌ను విమర్శించారు. ఇది “బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్టు” ఉందని వ్యాఖ్యానిస్తూ, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వినూత్న పరిష్కారాలు లేవని ఆరోపించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కీలక ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నమని ఆరోపించారు. గత దశాబ్దంలో రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసిన ప్రభుత్వం, మధ్యతరగతి వర్గాలకు కేవలం తక్కువ స్థాయి పన్ను మినహాయింపును మాత్రమే అందించిందని పేర్కొన్నారు. రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం వల్ల సంవత్సరానికి రూ. 80,000 ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇది నెలకు కేవలం రూ. 6,666 మాత్రమే, దేశం మొత్తం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో పోరాడుతున్న వేళ, మోదీ ప్రభుత్వం తప్పుడు ప్రశంసలు పొందడంలో బిజీగా ఉందని ఖర్గే విమర్శించారు.

యువత, మహిళలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల కోసం ఈ బడ్జెట్‌లో సరైన చర్యలు లేవని ఖర్గే అన్నారు. ‘మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని మోదీ హామీ ఇచ్చారు, కానీ అనుకున్న మార్గంలో ముందుకు సాగలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సరైన రోడ్‌మ్యాప్ లేదు, వ్యవసాయ ఇన్‌పుట్‌లపై GSTలో రాయితీలు లేవు. అలాగే, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ఆరోగ్యం, విద్య, స్కాలర్‌షిప్‌ల కోసం ఏ ప్రణాళికలు లేవు’ అని ఆయన విమర్శించారు.

ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, ఉద్యోగాల సృష్టికి లేదా తగ్గుతున్న వినియోగాన్ని అధిగమించడానికి ఎలాంటి సంస్కరణలు లేవని ఖర్గే ఎత్తిచూపారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువగా ప్రచారానికి మాత్రమే పరిమితమై, సమర్థవంతంగా అమలవడం లేదని విమర్శించారు. ఓవరాల్‌గా, ఈ బడ్జెట్ ప్రజలను మోసం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నమని ఖర్గే పేర్కొన్నారు.

నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించారు. వ్యవసాయం, మధ్యతరగతి వర్గాలతో పాటు వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా అనేక చర్యలను ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపులను విస్తరించడం, సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లింపు నుండి మినహాయింపు పొందడం ఒక ముఖ్యమైన అంశంగా నిలిచింది. గతంలో మినహాయింపు పరిమితి రూ.7 లక్షలుగా ఉండేది.

Budget 2025 Google news Mallikarjun Kharge Narendra Modi Nirmala Sitharaman rahul gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.