తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష(Telugu Language)కు అవసరమైన ప్రాధాన్యత తగ్గిపోతున్న తరుణంలో, పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో (Punjab government schools) విద్యార్థులు తెలుగు నేర్చుకుంటుండటం గర్వకారణంగా మారింది. ‘భారతీయ భాషా సమ్మర్ క్యాంప్’ కింద పంజాబ్లోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తెలుగు భాష యొక్క ప్రాథమిక అంశాలు నేర్పించే తరగతులు ప్రారంభమయ్యాయి. జూన్ 5, 2025 వరకు జరిగే ఈ తరగతులు పాఠశాలల సెలవుల సమయంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించబడుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పథకంలో భాగం.
పంజాబీ భాషలో అర్థమయ్యేలా తెలుగు పదాలు
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ మాతృభాషతో పాటు మరో భారతీయ భాషలో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను పొందుతారు. తెలుగు భాషా అక్షరాలు, సంఖ్యలు, సంభాషణలు మొదలైనవి పంజాబీ భాషలో అర్థమయ్యేలా ఉపాధ్యాయులు చదువు చేస్తున్నారు. ప్రత్యేకించి ఇంగ్లీష్, హిందీ, పంజాబీ భాష ఉపాధ్యాయులు ఈ శిక్షణను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నం భాషల మార్పిడి ద్వారా సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ఒక పెద్ద అడుగుగా నిలుస్తోంది.
Read Also : TTD : తిరుమలలో వరుస ఘటనల పై విచారణ చేపట్టాలని డీజీపీకి భానుప్రకాష్ రెడ్డి లేఖ
పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తెలుగు నేర్పడం గొప్ప మార్పు
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని పాఠశాలలు తెలుగు భాషను రెండవ భాషగా తీసుకోవడంపై ప్రోత్సాహం ఇవ్వకపోవడం ఆందోళనకరంగా మారింది. టీచర్లు తెలుగు తీసుకోకుండా హిందీని ఎంచుకోవాలని విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తెలుగు నేర్పడం గొప్ప మార్పుగా భావించవచ్చు.
Telugu teaching in Punjab schools, part of the Centre’s ‘Ek Bharat Shreshtha Bharat’ initiative, aims to expose students to South Indian linguistic and cultural heritage. #Telugu #AndhraPradesh pic.twitter.com/m00yvlOj1Y— Andhra Nexus (@AndhraNexus) June 1, 2025