📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Priyanka Gandhi: ప్ర‌శ్న‌లు వేయ‌డం, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డం ప్ర‌తిప‌క్ష నేత విధి

Author Icon By Sudha
Updated: August 5, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ ఇటీవల ఒక కీలక వ్యాఖ్య చేస్తూ, “నిజమైన భారతీయుడెవరో తేల్చేది జడ్జీలు కాదు, అది ప్రజల హక్కు” అని అన్నారు. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈ మాటలు చెప్పారు. చైనా మ‌న భూభాగాన్ని ఆక్ర‌మించిన‌ట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై సోమ‌వారం సుప్రీంకోర్టు (Supreme Court)సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. నిజ‌మైన భార‌తీయులు అలా మాట్లాడ‌రు అని కోర్టు ఆ కేసులో పేర్కొన్న‌ది. కోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై రాహుల్ సోద‌రి ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) స్పందించారు. ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఆమె బదులిస్తూ రాహుల్‌ను స‌మ‌ర్ధించారు. ప్ర‌శ్న‌లు వేయ‌డం, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డం ప్ర‌తిప‌క్ష నేత విధి అని ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) అన్నారు. నిజ‌మైన భార‌తీయులు కాదా అన్న స్టేట్మెంట్‌పై మాట్లాడుతూ.. న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల పూర్తి గౌర‌వం ఉంద‌ని, కానీ నిజ‌మైన భార‌తీయుడిని తేల్చేది జ‌డ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) అన్నారు. రాహుల్ గాంధీ సైన్యాన్ని, సైనికుల‌ను ఎల్ల‌ప్పుడూ గౌర‌వించార‌ని ఆమె పేర్కొన్నారు.

Priyanka Gandhi: ప్ర‌శ్న‌లు వేయ‌డం, ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డం ప్ర‌తిప‌క్ష నేత విధి

నిజ‌మైన భార‌తీయుడు ఎవ‌ర‌న్న దానికి నిర్వ‌చ‌నం ఎవ‌రు ఇస్తార‌ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌శ్న‌లు వేస్తే స‌మాధానం ఇవ్వ‌డం లేద‌ని, కానీ పార్ల‌మెంట్ బ‌య‌ట మాట్లాడితే జాతివ్య‌రేకుల‌మ‌ని ముద్ర వేస్తున్న‌ట్లు ఆరోపించారు. ఇలాంటి సంద‌ర్భంలో నిజ‌మైన భార‌తీయుడికి నిర్వ‌చ‌నం ఎవ‌రు ఇస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మేం నిజ‌మైన భార‌తీయుల‌మ‌ని, అందుకే దేశం త‌ర‌పున ప్ర‌శ్న‌లు వేస్తున్నామ‌న్నారు.

రాబర్ట్ వాద్రా పంజాబీ?

రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఏప్రిల్ 18, 1969న రాజేంద్ర వాద్రా మరియు మౌరీన్ దంపతులకు జన్మించారు. అతని తండ్రి కుటుంబం పంజాబీ సంతతికి చెందినది మరియు మొరాదాబాద్‌లో స్థిరపడింది. అతని తండ్రి కుటుంబం ప్రస్తుత పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌కు చెందినది. రాజేంద్ర తండ్రి దేశ విభజన సమయంలో భారతదేశానికి వెళ్లారు.

డిఎల్ఎఫ్ మరియు రాబర్ట్ వాద్రా మధ్య సంబంధం ఏమిటి?

హుడా పాలనలో రాబర్ట్ వాద్రా మరియు DLF లబ్ధిదారులైన బిల్డర్లు. DLF నుండి అన్‌సెక్యూర్డ్ రుణాలను ఉపయోగించి వాద్రా ఆస్తులను కొనుగోలు చేశారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేయడానికి 2015లో “జస్టిస్ ధింగ్రా కమిషన్” ఏర్పడింది. ధింగ్రా కమిషన్ హుడాపై అభియోగం మోపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Satya Pal Malik : జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్

Breaking News congress party Indian Politics latest news Opposition Role Priyanka Gandhi Questioning Government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.