📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Priyanka Gandhi: నేరవేరని హామీలను ప్రకటిస్తున్న ఎన్డీయే

Author Icon By Sushmitha
Updated: November 3, 2025 • 5:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోన్‌బర్సా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి వరాలు ప్రకటిస్తోందని, అయితే గత ఇరవై ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఏఐసీసీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల‌ను సూటిగా ప్రశ్నించారు. సోన్‌బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోదీ అనవసర విషయాలన్నీ మాట్లాడుతున్నారని విమర్శించారు.

Read Also: Telangana: పత్తి రైతుల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన

అవమానాల మంత్రిత్వ శాఖ’పై ఎద్దేవా

ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌లో ఉన్న అవినీతి, దుష్పరిపాలనపై నోరు మెదపడం లేదని ప్రియాంక మండిపడ్డారు. దేశాన్ని, బీహార్‌ను అవమానించారని ప్రతిపక్ష నాయకులపై ప్రధాని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ‘అవమానాల మంత్రిత్వ శాఖ’ ను ఏర్పాటు చేయాలని ఆమె వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా, దేశాన్ని అవమానిస్తున్నారని విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు.

నితీశ్ కుమార్ రిమోట్ కంట్రోల్ పాలన

ఎన్నికలు ఉన్నాయనే కారణంతో వరాలు ప్రకటించడం కంటే ముందు ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. బీహార్ ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ నడపడం లేదని, ప్రధానమంత్రి మరియు ఇతర వ్యక్తులు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తున్నారని ఆమె అన్నారు. ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతోందని, వారికి తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Amit Shah Bihar Elections Bihar Government Google News in Telugu Latest News in Telugu Narendra Modi NDA alliance Priyanka Gandhi Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.