📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రధాని .. ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై ఆరా

Author Icon By sumalatha chinthakayala
Updated: March 9, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స

ఆదివారం తెల్లవారు జామున 2గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్ ధన్‌ఖడ్‌ను ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు, ఈ ఉదయాన్నే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు

కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఉప-రాష్ట్రపతిగా 2022లో ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి, ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. సీఎంవో, రాజ్‌భవన్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పునిప్పులా పరిస్థితి ఉండేది. ఈ వివాదంతోనే జగదీప్ ధన్‌ఖడ్‌ పేరు మీడియాకెక్కింది.

aiims Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu PM Modi Telugu News online Vice President health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.