📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన !

Author Icon By sumalatha chinthakayala
Updated: April 7, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్టు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కాలేదు. తొమ్మిదేళ్ల క్రితం రాజధాని పనులకు ప్రధాని మోడీ చేతుల మీదుగానే ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి, ఎక్కడి పనులు అక్కడే నిలిపేసింది. అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసింది. అప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేన వంటి పార్టీలతో పాటు బీజేపీ కూడా అండగా నిలిచింది.

రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని పట్టాలెక్కించేందుకు నడుంకట్టింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ఈసారి రాజధానికి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రూ.15 వేల కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి. హడ్కో కూడా రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ఈ తొమ్మిది నెలల్లో అధిగమించి… రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. రూ.37,702 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. అన్ని పనుల్నీ దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Amaravati Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu PM Modi Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.