పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గుర్రపు బగ్గీలో.. పార్లమెంట్కి వచ్చారు. ఆ తర్వాత ఆమె రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియా ముందు మాట్లాడారు. “మహాలక్ష్మీ అమ్మవారు మనకు సిద్ధి, బుద్ధి ప్రసాదిస్తుంది. పేదలు, సామాన్య ప్రజలపై అమ్మవారి దయ ఎప్పటికీ ఉండాలి. భారత శక్తి సామర్థ్యాలు మన దేశానికీ, మనకూ ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. మూడోసారి ఎన్డీయేకి ప్రజలు అధికారం ఇచ్చారు. మూడోసారి పార్లమెంట్లో ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. ఇది ప్రజల్లో కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని చూడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సరికొత్తదనం, ఇన్క్లూజన్, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కొత్త అంశాలపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది” అని మోదీ అన్నారు. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నాం. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది.
ఉభయ సభలు చక్కగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాను. చర్చలు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.