Telugu News: Prime Minister Modi: పేలుడు బాధితులను పరామర్శించిన మోడీ

Read Time:  1 min
Prime Minister Modi
Prime Minister Modi
FONT SIZE
GET APP

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో పన్నెండు మంది మరణించగా, మరో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే LNJP ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also:  Delhi blast : ఈ నెల 10న ఢిల్లీ వైపు కారును తీసుకెళ్లిన ఉమర్ నబీ

 Prime Minister Modi

Prime Minister Modi: ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్కరి పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకుని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు తక్షణమే అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు కారణాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు, గాయపడిన వారికి ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.