📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ

Author Icon By sumalatha chinthakayala
Updated: January 7, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చండీగఢ్‌ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు పరిష్కారం చూపేందుకు జోక్యం చేసుకోవాలని కోరేందుకు రాష్ట్రపతి ముర్ముతో భేటీకి ఎస్కేఎం ప్రతినిధులు సోమవారం సమయం కోరారు. సమయం కేటాయించాలని కోరుతూ తాము చేసిన అభ్యర్థనకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చినందుకు ఎస్కేఎం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపింది.

image

సమయాభావం కారణంగా రైతుల ప్రతినిధులను కలుసుకోవడానికి ఆమె నిరాకరించడం పట్ల ఎస్కేఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు పరిష్కరించలేక పోయిన ఈ ప్రతిష్టంభనను తొలగించి, గత 41 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ప్రాణాలను కాపాడేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టేందుకు వీలుగా రైతుల ఆందోళన విషయంలో జోక్యం చేసుకోవాలన్న తమ అభ్యర్థనను రాష్ట్రపతి భవన్‌ సమీక్షించగలరని ఎస్కేఎం ఆశాభావం వ్యక్తం చేసింది. సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉందని పేర్కొంది.

Farmers farmers association President Draupadi Murmu representatives skm

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.