Latest News: Prayagraj: పాదచారులపై దూసుకెళ్లిన జాగ్వార్ – ఒకరు మృతి, ఎనిమిది మంది గాయాలు

Read Time:  1 min
Prayagraj
Prayagraj
FONT SIZE
GET APP

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) నగరం ఒక భయంకర రోడ్డు ప్రమాదానికి వేదికైంది. జాగ్వార్ కారు అదుపు తప్పి పాదచారులపై దూసుకెళ్లడంతో, ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read also:  Louvre Heist: చరిత్రలోనే పెద్ద దోపిడీ – 7 నిమిషాల్లో మ్యూజియం ఖాళీ

Prayagraj

ఈ ఘటన అక్టోబర్ 19న రాజ్‌రూప్పూర్ మార్కెట్ సమీపంలో చోటుచేసుకుంది. కామధేను స్వీట్ హౌస్ యజమాని మేనల్లుడు రచిత్ మధ్యన్ అతివేగంగా కారు నడుపుతూ అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఆ క్రమంలో రోడ్డుపై నడుస్తున్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ప్రదీప్ పటేల్ అనే ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పిల్లలు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మద్యం మత్తులో ప్రమాదం – ఆసుపత్రి నుండి అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రదేశికుల సమాచారం మేరకు రచిత్ మధ్యన్ ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. ప్రమాదం తర్వాత అతనికి గాయాలు కావడంతో లక్నోలోని(Lucknow) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే, మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తరువాత రాత్రి 11 గంటలకు ప్రయాగ్‌రాజ్(Prayagraj) మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. పోలీసులు నిందితుడి జాగ్వార్ కారును స్వాధీనం చేసుకుని సాక్ష్యాల సేకరణలో ఉన్నారు.

సీసీటీవీ ఫుటేజ్ షాక్ – సోషల్ మీడియాలో వైరల్

ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిలో రచిత్ నడిపిన కారు ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటడానికి ప్రయత్నిస్తూ, వేగంగా పాదచారులపై దూసుకెళ్లినట్లు కనిపిస్తోంది. స్థానికులు ఘటనను చూసి భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ధనవంతుల పిల్లలు చట్టానికి అతీతులు కాదు” అని నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.