📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu News: Pratap Sarnaik: మహారాష్ట్ర మంత్రి నిర్వాకం… రూ. 200 కోట్ల భూమి రూ. 3 కోట్లకే సొంతం

Author Icon By Sushmitha
Updated: November 8, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో భూకుంభకోణం ఆరోపణలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) కుమారుడిపై వచ్చిన భూ వివాదం ఇంకా సద్దుమణగక ముందే, తాజాగా రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే దక్కించుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

Read Also: Bihar Elections: ఎన్డీఏ కి మద్దతుగా బీహార్ లో నారా లోకేష్ ప్రచారం

Pratap Sarnaik

కాంగ్రెస్ నాయకుడి ఆరోపణ

ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరుల సమావేశంలో చేశారు. ప్రతాప్ సర్‌నాయక్(Pratap Sarnaik) మీరా భయాందర్ ప్రాంతంలో దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఆ స్థలంలో ఆయన ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు వడెట్టివార్ తెలిపారు.

రెవెన్యూ మంత్రి స్పందన, అజిత్ పవార్ కేసు

ఈ ఆరోపణలపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పందించారు. ఈ విషయం గురించి తాను విన్నానని, అయితే దీనిపై తమకు ఎవరి దగ్గరి నుంచి అధికారిక ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం మానేసి, మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. భూమికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన సంస్థకు కూడా రూ. 18,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ. 300 కోట్లకే విక్రయించినట్లు కాంగ్రెస్ గతంలో ఆరోపించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశంపై దర్యాప్తునకు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Ajit pawar Chandrashekhar Bawankule Google News in Telugu Land Scam Latest News in Telugu Maharashtra Parth Pawar Pratap Sarnaik Telugu News Today Vijay Wadettiwar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.