हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

జేడీయూ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Anusha
జేడీయూ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శారీరకంగా అలసిపోయారని, మానసికంగా రిటైరయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

భారీ ర్యాలీ

ప్రశాంత్ కిషోర్ త్వరలో ఏప్రిల్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ర్యాలీ ఇప్పటివరకు ఉన్న అన్ని రాజకీయ సమీకరణాలను తుడిచిపెట్టేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ పొత్తుల రాజకీయమే నడుపుతున్నారని, అవి లేకపోతే ఆయన అధికారంలో ఉండలేరని విమర్శించారు.నితీశ్ కుమార్ రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా నిలువరించాలంటే, బీహార్ ప్రజలు జేడీయూకు ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి చేశారు. అప్పుడు మాత్రమే నితీశ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని వ్యాఖ్యానించారు.

కొత్త మలుపు

ఈ కామెంట్స్ అనంతరం బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ రేగింది. నితీశ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

సంచలన వ్యాఖ్యలు

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు. “నితీశ్ శారీరకంగా అలసిపోయారు, మానసికంగా రిటైరయ్యారు” అంటూ వ్యాఖ్యానించిన పీకే, జేడీయూకు ఒక్క సీటు కూడా రాకూడదని ప్రజలను కోరారు.

67c07f2452832 kishor slams nitish urges voters to reject jdu 270502248 16x9

ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లాలో జన్మించారు. ఆయన ఒక ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. పాలక పక్షాల, ప్రధాన నాయకుల ప్రచారానికి వ్యూహాలను రూపొందించడంలో మాస్టర్‌ మైండ్‌గా గుర్తింపు పొందారు.

రాజకీయ వ్యూహకర్త

2014 లోక్‌సభ ఎన్నికలు: నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా గెలిచేలా భారతీయ జనతా పార్టీ కోసం ప్రచార వ్యూహాన్ని రూపొందించారు.

2015 బీహార్ ఎన్నికలు: నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహాగత్బంధన్ గెలుపునకు కీలకంగా పనిచేశారు.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని తీసుకురావడంలో సహాయపడ్డారు.

2019 లోక్‌సభ ఎన్నికలు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.

2021 బెంగాల్ ఎన్నికలు: మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ గెలుపునకు సహాయపడ్డారు.

రాజకీయ ప్రవేశం

జన్ సురాజ్ పేరుతో తన స్వంత రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన బీహార్‌లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం కొత్త మార్గాన్ని చూపేందుకు ఈ పార్టీని స్థాపించారు.

ప్రశాంత్ కిషోర్ నితీశ్ కుమార్, ఇతర పార్టీలు పట్ల కఠిన విమర్శలు చేస్తూ తనదైన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు బీహార్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే సామర్థ్యం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870