📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Prashant Kishor: ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

Author Icon By Sudha
Updated: February 6, 2026 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌(Prashant Kishor)కు చెందిన జ‌న్ సూరజ్ పార్టీ దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor)దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం త‌న సంక్షేమ ప‌థ‌కంతో ఓట‌ర్లకు డ‌బ్బులు పంచింద‌ని జ‌న్‌సూర‌జ్ పార్టీ ఆరోపించింది. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిల్‌ను కొట్టిపారేసింది. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని తిర‌స్క‌రించార‌ని, ఇప్పుడు మీరు ప‌బ్లిసిటీ కోసం న్యాయ ప్ర‌క్రియ‌ను వాడుకుంటార‌ని చీఫ్ జ‌స్టిస్ అన్నారు. మీకెన్ని ఓట్లు వ‌చ్చాయి, ఒక‌సారి ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తే, రిలీఫ్ కోసం జుడిషియ‌ల్ ఫోరంను వాడుతున్నార‌ని, ఆ స్కీమ్‌ను ఎవ‌రో ఒక‌రు ముందుగా ఛాలెంజ్ చేసి ఉండాల్సింద‌ని కోర్టు పేర్కొన్న‌ది.

Read Also : Telangana: స్పీకర్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం

Prashant Kishor

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న్‌సూర‌జ్ పార్టీ మొత్తం 238 సీట్ల‌లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. అయితే ఆ పిల్‌ను బీహార్ హైకోర్టుకు పంపింది సుప్రీం. కుటంబంలోని మ‌హిళ‌కు ప‌దివేలు ఇవ్వ‌డాన్ని పార్టీ త‌ప్పుప‌ట్టింది. ఆర్టిక‌ల్ 32 కింద త‌న పిటీష‌న్ ఫైల్ చేసింది. సుమారు 36 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు రిలీజ్ చేసి అధికార పార్టీ అక్ర‌మ విధానాల‌కు పాల్ప‌డిన‌ట్లు జ‌న్‌సూర‌జ్ త‌న పిటీష‌న్‌లో తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News contempt of court Indian Judiciary latest news political strategist Prashant Kishor Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.