📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

ఎయిమ్స్‌కు ప్రశాంత్ కిషోర్ తరలింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 6, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాట్నా: బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతగా మారి విద్యార్థులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదానంలో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2న దీక్షను ప్రారంభించారు. అయితే, సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయనను అదుపులోకి తీసుకొని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. పోలీసులకు వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో బలవంతంగా అక్కడి నుంచి ఆయనను తరలించారు. దీక్షా స్థలి వద్ద వేదికను ఖాళీ చేయించడంతోపాటు, పార్టీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో గాంధీ మైదానం వద్ద గందరగోళం ఏర్పడింది.

కాగా, డిసెంబర్ 13న బీహార్‌లో నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. నిరసనల సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆందోళనకారులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు దిగారు. ఇక, ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేయడం వివాదాస్పదమైంది. కోట్ల విలువైన ఈ వాహనంలో కిచెన్, బెడ్ రూమ్, ఏసీ వంటి సౌకర్యాలు ఉండడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని వల్ల ప్రశాంత్ కిషోర్ లక్ష్యాలపై అనుమానాలు, విమర్శలు వచ్చాయి.

aiims BPSC Exam Gandhi Maidan Indefinite strike Prashant Kishor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.