📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

మన్మోహన్‌కు స్మారకమా..? ప్రణబ్ కుమార్తె విమర్శలు

Author Icon By Sudheer
Updated: December 28, 2024 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన తండ్రి దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన మరణానంతరం పార్టీ నుంచి కనీసం సంతాపం ప్రకటించకపోవడాన్ని ఆమె తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా షర్మిష్ఠ స్పందించారు. ప్రణబ్ రాష్ట్రపతిగా మాత్రమే కాకుండా, పార్టీకి కూడా అసాధారణ సేవలందించారని పేర్కొన్నారు. మరణానంతరం నా తండ్రికి స్మారకమో లేక కనీసం సంతాపం ప్రకటించమని అడగకపోవడం బాధాకరం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఇవి ప్రధానులకు మాత్రమే అని చెప్పడం తనను మరింత బాధించిందని షర్మిష్ఠ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి సమాధానంగా ఆమె తన తండ్రి రాసిన డైరీస్‌ను ఉదహరించారు. కె.ఆర్. నారాయణన్‌కు సంతాపం ప్రకటించినప్పుడు పార్టీ తీరు ఎంతో విభిన్నంగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ మార్పును చూస్తుంటే దిగ్భ్రాంతి చెందుతున్నాను” అని ఆమె వివరించారు. ఈమె మాటలతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఊపందుకున్నాయి. ప్రణబ్ ముఖర్జీకి పార్టీలో ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రశ్నలు తలెత్తాయి. మున్ముందు పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు సంకేతంగా కనిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకంపై నిరీక్షణ కొనసాగుతుండగా, షర్మిష్ఠ వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

Manmohan Singh memorial pranab mukherjee pranab mukherjee daughter Sharmistha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.