గౌరీ లంకేశ్ వర్ధంతి నాడు ప్రముఖ నటుడు మరియు సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ తన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు.
“డియర్ గౌరీ, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ గొంతు మేం మూగబోనివ్వం. మేము నిన్ను పాతిపెట్టలేదు.. విత్తనంగా నాటాం,” అంటూ ఆయన స్పష్టం చేశారు.
గౌరీ లంకేశ్ హత్య – దేశాన్ని కలచివేసిన సంఘటన
సరిగ్గా 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన నివాసం ముందు గౌరీ లంకేశ్(Gauri Lankesh)(55) దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె ఇంటి వద్దకు చేరుకుంటున్న సమయంలో, బైక్పై వచ్చిన ముసుగుదారులు ఆమెపై అతి దగ్గర నుంచి నాలుగు గుండ్లు కాల్చారు. ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందారు.
ప్రజా గొంతుకగా నిలిచిన గౌరీ
గౌరీ లంకేశ్ తన జర్నలిజం ద్వారా మతతత్వం, మూఢనమ్మకాలు, అసమానతలకు గట్టిగా వ్యతిరేకత తెలిపినవారు. తన పత్రిక ద్వారా నిర్భయంగా ప్రజా సమస్యలపై గళమెత్తిన ఆమె, ఎంతమంది శత్రువులను కలిగి ఉన్నా వెనుకడుగు వేయలేదు. ఈ కారణంగానే ఆమెను టార్గెట్ చేసినట్టు అనేక అనుమానాలు వెలువడ్డాయి.
న్యాయం ఆలస్యం – బాధితుల నిరసనలు కొనసాగుతూనే..
గౌరీ హత్య కేసులో ఇప్పటివరకు 17 మందిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, ఎనిమిదేళ్లవుతున్నా కేసుకు తుది తీర్పు రాలేదు. నిందితులపై శిక్షలు విధించకపోవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, మిత్రులు, అనుచరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. “ఐ యామ్ గౌరీ” (I am Gauri).అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రతిఘటనలు, ర్యాలీలు, ప్రజా ఉద్యమాలు జరిగిన నేపథ్యంలో కూడా న్యాయ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.
హత్య వెనుక ఉన్న కారణాలపై అనుమానాలు
గౌరీ తన హత్యకు ముందు ఒక ప్రముఖ దేవాలయానికి చెందిన మతాధికారి అక్రమాలపై కీలక సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. ఆమె ఆ విషయాలను బహిరంగం చేసే ప్రయత్నాల్లో ఉండటమే ఆమె హత్యకు ప్రధాన కారణం కావచ్చని సన్నిహితులు అనుమానిస్తున్నారు.
హత్య అనంతరం ఆమె ల్యాప్టాప్ ధ్వంసం చేయడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది.
“గౌరీ ఓ గొంతు కాదు, ఒక ఉద్యమం” – ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్ మాటల్లో గౌరీ లంకేశ్ ఒక్కరే కాదు, ఒక ఉద్యమానికి ప్రతీక. “నిన్ను చంపినవాళ్లు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే, నీవల్ల స్పూర్తి పొందినవాళ్లు జైళ్లలో ఉన్నారు,” అంటూ ఆయన ప్రస్తుత సామాజిక పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు.
read hindi news:hindi.vaartha.com
Read also: