📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pahalgam : పీఓకేలో హమాస్ కదలికల తరువాత పహల్గాంలో ఉగ్రదాడి

Author Icon By Digital
Updated: April 26, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pahalgam : పీఓకేలో హమాస్ కదలికల తరువాత పహల్గాంలో ఉగ్రదాడిపీఓకేలో హమాస్ వచ్చాకే పహల్గాంలో ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ రాయబారి రెవెన్ అజర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి, తాజాగా పహల్గాంలో జరిగిన దాడికి మధ్య స్పష్టమైన పోలికలు ఉన్నాయని ఆయన చెప్పారు. రెండు ఘటనల్లోనూ అమాయక పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరిపారని, ఉగ్రవాద గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతోందని రెవెన్ అజర్ హెచ్చరించారు.ఉగ్రవాద సంస్థలు పరస్పరం సహకరించుకోవడం కాకుండా, ఒకరికొకరు అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. హమాస్ నాయకులు ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో జైషే మహ్మద్ కార్యకర్తలతో సమావేశమైన సమాచారం ఉన్నందున, పహల్గాం దాడికి ఈ పరిణామాలకు సంబంధం ఉండొచ్చని రెవెన్ అజర్ అనుమానం వ్యక్తం చేశారు.

Pahalgam : పీఓకేలో హమాస్ కదలికల తరువాత పహల్గాంలో ఉగ్రదాడి

Pahalgam : పీఓకేలో హమాస్ నేతల కదలికలు – పహల్గాం దాడికి సంబంధం

పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై దాడి జరగగా, ఇజ్రాయెల్లో సంగీత వేడుక జరుపుకుంటున్న సమయంలో హమాస్ దాడులు జరిగాయని చెప్పారు. ఈ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన తీరును, ముఖ్యంగా బీహార్‌లోని మధుబని సభలో చేసిన ప్రసంగాన్ని రెవెన్ అజర్ ప్రశంసించారు. భారత ప్రభుత్వం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా, తీసుకున్న కఠిన చర్యలు కు ధైర్యం కలిపించాయని పేర్కొన్నారు.ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉందని రెవెన్ అజర్ స్పష్టం చేశారు. ఆయుధాలు, నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం రూపంలో మద్దతు ఇచ్చే దేశాలను ప్రపంచ దేశాలు కఠినంగా ఎదుర్కొనాలని సూచించారు. ఇదే సమయంలో, పహల్గాం ఉగ్రదాడి, పాకిస్థాన్ చర్యల గురించి భారత్ జీ20 దేశాలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 దేశాల రాయబారులతో సమావేశమైన భారత్ కార్యదర్శి విక్రం మిస్త్రీ ఈ విషయాలను వివరించారు. భారత్ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న కఠిన విధానాన్ని కూడా ఈ సందర్భంగా వివరించారు.

Read More : Danish Kaneria: పాక్‌లో పహల్గాం బాధితుల పరిస్థితే నాది కూడా: డానిష్ కనేరియా

G20 Meeting Hamas POK India Terror Policy Israel Ambassador Jammu Kashmir Terror Latest News in Telugu Pahalgam Terror Attack Pak Terror Activities POK Hamas Link Telugu News Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.