బిహార్ సీఎం నీతీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని అన్ని ఎన్నికల రికార్డ్ను బ్రేక్ చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిని బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని తిరుగుతున్న నేతలే దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వేల కోట్ల స్కామ్లు చేసి బెయిల్పై బయట తిరుగుతున్న ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు కూడా భారతరత్న కర్పూరీ ఠాకూర్ లాంటి మహనీయుడి బిరుదును పొందాలని తాపత్రయ పడుతున్నారని మోదీ విమర్శించారు. శుక్రవారం బిహార్లోని సమస్తీపూర్లోని జరిగిన ఎన్డీఏ కూటమి ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Afghanistan: పాక్ కు నీళ్లు బంద్ చేయనున్న ఆఫ్ఘనిస్థాన్

ఆర్జేడీ పార్టీ లాంతరు గుర్తుపై మోదీ సెటైర్స్
ఈ సందర్భంగా బహిరంగ సభకు హాజరైన ప్రజలను వారివారి ఫోన్లలోని టార్చ్ లైట్లను ఆన్ చేయమని ప్రధానమంత్రి కోరారు. దీంతో అందరూ ఫోన్లలోని టార్చ్ లైట్లను ఆన్ చేసి చూపించారు. ప్రజలందరి చేతుల్లోకి ఆధునిక గాడ్జెట్లు వచ్చినందున, ఇక లాంతర్లు అక్కర్లేదని మోదీ వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్జేడీ పార్టీ లాంతరు గుర్తుపై సెటైర్స్ వేశారు. ‘2005 అక్టోబరులో జంగిల్ రాజ్ నుంచి బిహార్కు విముక్తి లభించింది. నీతీశ్ కుమార్ సారథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటైంది. ఆ సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ – ఆర్జేడీ కూటమి పాలన ఉండేది.
కాంగ్రెస్ను ఆర్జేడీ బ్లాక్ మెయిల్: మోదీ
నీతీశ్ కుమార్కు అనుకూలంగా ఓట్లు వేశారనే అక్కసుతో, నాటి కేంద్ర సర్కారులో ఉన్న ఆర్జేడీ పార్టీ బిహారీలపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. బిహార్లోని నీతీశ్ కుమార్ సర్కారుకు ఏదైనా సాయం చేస్తే, కేంద్ర సర్కారుకు మద్దతును ఉపసంహరించుకుంటాం అని చెబుతూ కాంగ్రెస్ను కూడా ఆర్జేడీ బ్లాక్ మెయిల్ చేసింది’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘మేం గత 11 ఏళ్లలో బిహార్కు ఆర్థిక సహాయాన్ని, బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచాం. ప్రస్తుతం రాష్ట్రంలో పండే మఖానా విదేశాలకు ఎగుమతి అవుతోంది. బిహార్కు భారీ పెట్టుబడులు వస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: