PM Modi Telangana Visit: వచ్చే ఏప్రిల్ రెండో వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ పర్యటన ప్రధానంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మరియు రాబోయే ఎన్నికల వ్యూహాల చుట్టూ సాగనుంది.
Read Also: Moinabad drugs case: రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితుల కస్టడీపై సోమవారం తీర్పు
బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభం
ఈ పర్యటనలో భాగంగా అత్యంత కీలకమైన బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) భవనాలను ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ వైద్య రంగంలో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలవనుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై గురి
కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం ఈ పర్యటనను పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడమా లేదా పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమా అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ నగర రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ఈ పర్యటనను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :