📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఫిట్‌ అండ్‌ హెల్తీ దేశంగా మారాలంటే.. ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి : ప్రధాని

Author Icon By sumalatha chinthakayala
Updated: February 24, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

10 మంది ప్రముఖులను నామినేట్‌ చేసిన మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఊబకాయం సమస్య గురించి మాట్లాడారు. దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోడీ నామినేట్‌ చేశారు. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయని ప్రధాని తెలిపారు.

గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు

ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం కేసులు పెరగడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. “ఫిట్‌ అండ్‌ హెల్తీ దేశంగా మారాలంటే.. మనం ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. మరింత ఆందోళనకర విషయం ఏంటంటే..? పిల్లల్లో ఊబకాయ సమస్య నాలుగు రెట్లు పెరిగింది” అని ప్రధాని మోడీ తెలిపారు. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారన్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

వంటనూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలి

ఇది చాలా ఆందోళనకర అంశమని ప్రధాని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలని సూచించారు. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు, యువ షూటర్ మను బాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ నటులు దినేశ్‌లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా, మోహన్‌లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని మోడీ నామినేట్‌ చేశారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mann Ki Baat Obesity PM Modi Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.