📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : PM Modi: భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇదే ఉత్త‌మ స‌మ‌యం : ప్ర‌ధాని మోదీ

Author Icon By Sudha
Updated: October 8, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇదే ఉత్త‌మ స‌మ‌యం అని ప్ర‌ధాని మోదీ(PM Modi) అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు చెప్పారు. మొబైల్స్‌, సెమీకండ‌క్ట‌ర్స్‌, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా సంస్క‌ర‌ణ‌లు జ‌ర‌గుతున్నాయ‌ని, ఇన్వెస్ట్‌మెట్ అవ‌కాశాలకు ఇదే అత్యుత్త‌మ స‌మ‌యం అని మోదీ (PM Modi) తెలిపారు. భార‌తీయ ప్ర‌జాస్వామ్య విధానం ఈజ్ ఆఫ్ బిజినెస్‌కు అనుకూలంగా ఉంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌సీల‌తో దేశం ఇన్వెస్ట‌ర్ ఫ్రెండ్లీ ప్రాంతంగా మారింద‌న్నారు.

PM Modi: భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇదే ఉత్త‌మ స‌మ‌యం : ప్ర‌ధాని మోదీ

పెట్టుబ‌డుల‌కు, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, మేకిన్ ఇండియాకు ఇదే ఉత్త‌మ స‌మ‌యం అన్నారు. సంస్క‌ర‌ణ‌ల వేగాన్ని మ‌రింత విస్త‌రిస్తున్నామ‌ని మోదీ (PM Modi)తెలిపారు. సెమీకండ‌క్ట‌ర్లు, మొబైల్స్‌, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో త‌యారీల‌కు భార‌త్ ప్రాధాన్య‌త ఇస్తోంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌లు, ఆవిష్క‌ర్త‌లు, స్టార్ట‌ప్‌లు ఇప్పుడు మ‌రింత దూసుకెళ్లాల‌న్నారు. డిజిట‌ల్ రంగంలో గ‌త ద‌శాబ్ధ కాలంలో ఇండియా వేగంగా ముందుకెళ్లింద‌న్నారు. భార‌త్‌లో 1జీబీ డేటా .. ఒక క‌ప్పు ఛాయ్ ధ‌ర క‌న్నా త‌క్కువే అని తెలిపారు. డిజిట‌ల్ క‌నెక్టివిటీ ఇప్పుడో ప్ర‌త్యేక హ‌క్కు లేదా ల‌గ్జ‌రీ కాదు అని, ఇది ప్ర‌తి భార‌తీయుడి జీవితంలో అంత‌ర్భాగ‌మైంద‌న్నారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద టెలికం మార్కెట్‌లో ఇండియా రెండో స్థానంలో ఉంద‌న్నారు. 5జీ మార్కెట్‌లోనూ రెండో స్థానంలో ఉన్నామ‌న్నారు. దేశంలో ఒక‌ప్పుడు 2జీ సేవ‌లు స‌రిగా అంద‌లేద‌ని, కానీ ఇప్పుడు ప్ర‌తి జిల్లాలోనూ 5జీ సేవ‌లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు.

మోడీ ఎన్నిసార్లు ప్రధాని అయ్యారు?

2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి ఇది.

నరేంద్ర మోడీ డిగ్రీ?

1978లో, మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) డిగ్రీని పొందారు. 1983లో, గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (MA) డిగ్రీని పొందారు, బాహ్య దూరవిద్య విద్యార్థిగా మొదటి తరగతిలో పట్టభద్రుడయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Foreign Investment Indian Economy Investment in India latest news Make in India PM Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.