📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

కుంభ‌మేళాపై ప‌రిస్థితి పై ప్రధాని స‌మీక్ష..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 29, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ సంగం తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌనీ అమావాస్య సందర్భంగా స్నానం ఆచరించేందుకు మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయపడినట్లు సమాచారం. అయితే ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడీ కుంభ‌మేళాపై ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

ప్ర‌ధాని మోడీ మ‌హాకుంభ్ ప‌రిస్థితిపై యూపీ సీఎం యోగితో ఇవాళ మాట్లాడారు. ఇప్ప‌టికే మూడు సార్లు మాట్లాడిన అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకున్నారు. కుంభ‌మేళా ప‌రిస్థితి పై ప్ర‌ధాని మోడీస‌మీక్షిస్తూనే ఉన్నారు. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని ఆదేశించారు. యూపీ ప్ర‌భుత్వ అధికారుల‌తో ఆయ‌న ట‌చ్‌లోనే ఉన్నారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్ని ఆయ‌న సూచిస్తున్నారు.

తొక్కిస‌లాట వ‌ల్ల 13 అకాడాలు అమృత స్నానం ర‌ద్దు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో వాళ్లు ప్ర‌క‌ట‌న జారీ చేశారు. అయితే ఇవాళ ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత అకాడాలు అమృత స్నానానికి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా యూపీ సీఎంతో ప‌రిస్థితి గురించి తెలుసుకున్నారు.

త్రివేణి సంగ‌మంలో తొక్కిస‌లాట జ‌రిగిన ప్ర‌దేశానికి ఉద‌యం సుమారు 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు మూడు గంట‌ల పాటు త‌ర‌లింపు ప్ర‌క్రియ జ‌రిగింది. అమావాస్య రోజున స్నానం చేయాల‌న్న ఉద్దేశంతో.. కోట్ల సంఖ్య‌లో భ‌క్తులు ప్ర‌యాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. అధికారులు అంచ‌నా ప్ర‌కారం.. ఇప్ప‌టికే 5 కోట్ల మంది ప్ర‌యాగ్‌రాజ్ ప‌రిస‌రాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడు సాయంత్రం వ‌ర‌కు ఆ సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

CM Yogi Adityanath Kumba mela Maha Kumbh stampede PM Modi Prayagraj

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.