📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News :Prime Minister: రాబోయే వేల శ‌తాబ్ధాల‌కు ఈ జెండా రాముడి విలువ‌ల‌ను చాటుతుంది : ప్ర‌ధాని మోదీ

Author Icon By Sudha
Updated: November 25, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అయోధ్య రామాల‌య ధ్వ‌జారోహ‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ (Prime Minister)ఇవాళ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ధ‌ర్మ ధ్వ‌జం కేవ‌లం జెండా మాత్ర‌మే కాదు అని, భార‌తీయ నాగ‌రిక‌త‌కు పున‌ర్జీవంగా ఈ ప‌తాకం నిలుస్తుంద‌ని అన్నారు. కాషాయ జెండా సూర్య‌వంశానికి చిహ్న‌మ‌ని, ఓం అక్ష‌రం.. కోవింద వృక్షం .. రామ‌రాజ్యానికి సంకేతంగా నిలుస్తుంద‌న్నారు. సంక‌ల్పానికి, స‌క్సెస్‌కు ఈ జెండా చిహ్న‌మ‌న్నారు. వందేళ్ల పోరాటానికి.. రాబోయే వేల శ‌తాబ్ధాల‌కు ఈ జెండా రాముడి విలువ‌ల‌ను చాటుతుంద‌న్నారు.స‌త్య‌మే ధ‌ర్మం అని ప్ర‌ధాని మోదీ (Prime Minister)అన్నారు. వివ‌క్ష‌, బాధ ఉండ‌కూడ‌ద‌ని, శాంతి.. సంతోషం ఉండాల‌న్నారు. పేదరికం ఉండ‌కూడ‌ద‌ని, ఎవరూ నిస్స‌హాయంగా ఉండ‌రాద‌న్నారు. గుడికి రాలేని వారు, గుడిపై ఎగురుతున్న జెండాను చూసినా.. వారికి అంతే పుణ్యం ద‌క్కుతుంద‌ని మ‌న గ్రంధాలు చెబుతాయ‌ని, చాలా దూరం నుంచి కూడా జెండాను చూసి రామ్‌ల‌ల్లా పుట్టిన ప్ర‌దేశం ఇదే అన్న ప్రేర‌ణ పొంద‌వ‌చ్చు అన్నారు.

Read Also : http://Modi Flag Hosting: అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం

Prime Minister

ఈ అద్భుత‌మైన సంద‌ర్భంలో కోట్లాది మంది రామ భ‌క్తుల‌కు హృద‌య పూర్వ‌క గ్రీటింగ్స్ చెబుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. రామాల‌య నిర్మాణం కోసం స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రామాల‌య నిర్మాణంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క కార్మికుడు, క‌ళాకారుడు, ప్లాన‌ర్‌, ఆర్కిటెక్ట్‌, వ‌ర్క‌ర్‌కు ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News India News latest news PM Narendra Modi prime minister Ram Temple Ram Values Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.