📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Modi: విద్యార్థులతో ముఖాముఖి – పరీక్షలపై కీలక సూచనలు

Author Icon By Pooja
Updated: February 9, 2026 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానాలు ఇచ్చారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, చదువులో ఎలా ముందుకు సాగాలో పలు సూచనలు చేశారు.

Read Also:NEETUG2026: దరఖాస్తులు ప్రారంభం.. మార్చి 8 వరకు అవకాశం

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని మోదీ(PM Modi) పేర్కొన్నారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చదువుతో పాటు యోగ, వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లు పెంచుకోవాలని సూచించారు.

రాయ్‌పుర్‌కు చెందిన ఓ విద్యార్థి పరీక్షల అనంతరం వెళ్లేందుకు ఐదు వెకేషన్ ప్రదేశాలు సూచించాలని కోరగా, ప్రయాణం మనిషిని కొత్తగా మార్చుతుందని మోదీ అన్నారు. ముఖ్యంగా రైలు ప్రయాణం ద్వారా వివిధ వర్గాల ప్రజలను కలవడం, వారి జీవితాలను దగ్గరగా చూడడం గొప్ప అనుభూతి అని చెప్పారు. అలాగే విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా ప్రతి సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువు అంటే పరీక్షల కోసం మాత్రమే కాకుండా జీవితం కోసం సిద్ధమవడం అని మోదీ వ్యాఖ్యానించారు. లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకొని క్రమశిక్షణతో చదువుకుంటే విజయాన్ని సాధించవచ్చని విద్యార్థులకు ధైర్యం చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ExamTips Google News in Telugu Latest News in Telugu ParikshaPeCharcha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.