ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాదికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయం విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. మార్చి తొలి వారంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రతి ఏడాది అర్హులైన రైతులకు రూ.6,000 సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2,000 చొప్పున నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు.
Read Also: NSC Scheme:పైసా రిస్క్ లేకుండా డబ్బు పెంచుకోవాలా? అయితే ఇలా చెయ్యండి!
ఈ ఏడాదికి సంబంధించిన తొలి విడత కోసం రైతులు కొంతకాలంగా ఎదురుచూస్తుండగా, త్వరలోనే వారి ఖాతాల్లోకి నగదు జమ కానుందని స్పష్టత వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారని సమాచారం. రైతులు ఈ సొమ్మును వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాలు లేదా ఇతర(PM Kisan) అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందులో మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనర్హులైన లబ్ధిదారులను తరచూ గుర్తించి జాబితా నుంచి తొలగిస్తోంది. ఇటీవల కూడా కొంతమంది పేర్లను తొలగించినట్లు సమాచారం. పీఎం కిసాన్ సాయం పొందాలంటే తప్పనిసరిగా e-KYC పూర్తి చేయడం, ఆధార్తో బ్యాంక్ ఖాతా అనుసంధానం చేయడం అవసరం. ఈ రెండు ప్రక్రియలు పూర్తి కాకపోతే సొమ్ము ఖాతాలో జమ కాదని కేంద్రం స్పష్టం చేసింది. రైతులు వెంటనే ఈ ప్రక్రియలు పూర్తి చేయాలని సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: