రైతుల (Farmers) కు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం – కిసాన్ (PM – Kisan) నిధులు మార్చి 13న విడుదల కానున్నాయి. ఈ పథకం కింద 22వ విడత నిధులను ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి.
ప్రధాని మోదీ.. అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పీఎం-కిసాన్ పథకాన్ని 2019లో మోదీ సర్కారు ప్రారంభించింది. ఏటా మూడు దఫాలుగా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: