PM Kisan 22nd Installment: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 13న అస్సాంలోని గువహతి వేదికగా ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ (PM-Kisan) పథకానికి సంబంధించిన 22వ విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 9.32 కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేసింది. మొత్తం రూ. 18,640 కోట్ల భారీ నిధులను ఒక్కో రైతుకు రూ. 2,000 చొప్పున పంపిణీ చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచారు.
Read Also:Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆ కనెక్షన్ ఉంటే సిలిండర్ రాదు!

డబ్బులు రాకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!
అయితే, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండి కూడా తమ ఖాతాల్లో డబ్బులు జమ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. రైతులు తమ ఫిర్యాదులను 155261, 1800115526, లేదా 011-23381092 వంటి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా తెలియజేయవచ్చు. అంతేకాకుండా, pmkisan-ict@gov.in అనే అధికారిక ఈమెయిల్ ఐడీకి మెయిల్ పంపడం ద్వారా కూడా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
సాధారణంగా కొన్ని సాంకేతిక లోపాల వల్ల పీఎం కిసాన్ నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ-కేవైసీ (e-KYC) అప్డేట్ చేయకపోవడం, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడం, లేదా భూమి రికార్డులలో (Land Records) తప్పులు ఉండటం వంటి కారణాల వల్ల డబ్బులు ఆగిపోవచ్చు. రైతులు తమ స్టేటస్ను ఒకసారి చెక్ చేసుకుని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: