📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

PM KISAN: ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

Author Icon By Vanipushpa
Updated: February 3, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో వ్యవసాయం అనేది వాతావరణం, మార్కెట్ ఒడిదుడుకులతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM KISAN) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో అందజేస్తారు. ఇప్పటివరకు 21 విడతలు విజయవంతంగా విడుదల కాగా.. ఇప్పుడు అందరి కళ్లు 22వ విడత నిధులపై ఉన్నాయి. నిధులు ఎప్పుడు విడుదలవుతాయి? నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 రైతు ఖాతాలో జమ కావాలి. గతంలో 21వ విడతను నవంబర్ 2025లో విడుదల చేశారు. ఆ లెక్కన చూస్తే.. ఫిబ్రవరి 2026తో నాలుగు నెలల గడువు ముగుస్తుంది. అందువల్ల, ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు, మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే వ్యవసాయ శాఖ నుండి ఇంకా ఖచ్చితమైన తేదీ వెలువడలేదు.

Read Also: H1b visa update : H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు, కొత్త లాటరీ రూల్స్!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే..

ఈ మూడు పనులు చేయకపోతే నిధులు రావు! ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఇవి పూర్తికాకపోతే మీకు రావాల్సిన రూ. 2,000 ఆగిపోయే ప్రమాదం ఉంది.. ఇ-కేవైసీ అప్‌డేట్: పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. మీరు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ద్వా రా ఆధార్, ఓటీపీ సాయంతో ఇంట్లోనే దీన్ని పూర్తి చేయవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే దగ్గరలోని సీఎస్‌సీ (CSC) సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా అప్‌డేట్ చేసుకోవాలి. ల్యాండ్ సీడింగ్ (Land Seeding): ప్రభుత్వ రికార్డుల ప్రకారం సాగు భూమి మీ పేరు మీద ఉంటేనే ఈ నిధులు అందుతాయి.

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మీ బెనిఫిషియరీ స్టేటస్‌లో ‘Land Seeding: No’ అని ఉంటే, వెంటనే స్థానిక రెవెన్యూ కార్యాలయం లేదా పట్వారీని సంప్రదించి భూమి వివరాలను నమోదు చేయించాలి. డిబిటి (DBT) యాక్టివేషన్: పీఎం కిసాన్ (PM KISAN) డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ అయి ఉండాలి , ఎన్‌పీసీఐ (NPCI) మ్యాపింగ్ పూర్తయి ఉండాలి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మీ అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయించి డిబిటి ఫీచర్‌ను ఆన్ చేసుకోవాలి. .. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోని ‘Beneficiary Status’ ఆప్షన్‌లోకి వెళ్లి మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేస్తే, పైన పేర్కొన్న మూడు పనులు (e-KYC, Land Seeding, Aadhaar Mapping) పూర్తయ్యాయో లేదో తెలుస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

farmer news India PM Kisan 22nd installment PM Kisan eKYC PM Kisan eligibility PM Kisan February update PM Kisan Scheme Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.