हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Piyush Goyal : చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

sumalatha chinthakayala
Piyush Goyal : చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

Piyush Goyal : కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరుగుతుండటంపై గోయల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించి చైనా ఆర్థికవృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు. ధరల వక్రీకరణ, అస్పష్ట సబ్సిడీలు, ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించే కార్మిక పద్ధతులు బీజింగ్‌ వృద్ధికి కారణమన్నారు.

చైనా వాణిజ్య విధానంపై పీయూష్

భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం

ఇది భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే.. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈసందర్భంగా ప్రపంచ వాణిజ్య నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇక, ఈ సందర్భంగా గోయల్ యూపీఏపై పలు ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కాలంలో భారత్‌- చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగా ఉందన్నారు. అయితే, యూపీఏ హయాంలో అది 25 రెట్లు పెరిగిందని ఆరోపించారు.

వాణిజ్య యుద్ధానికి, ఆర్థిక వ్యవస్థల మందగమనానికి దారితీయొచ్చు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజింగ్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్‌ చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అది మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఒప్పందం తర్వాత భారత్‌లోకి వచ్చిన అనేక డ్రాగన్‌ ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా తగ్గాయి. ఇది మన స్థానిక ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. మనం పూర్తిగా చైనాపై ఆధారపడేలా చేసింది అని గోయల్‌ పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కూడా అగ్రరాజ్యం ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించింది. దీంతో వాణిజ్య యుద్ధానికి, ఆర్థిక వ్యవస్థల మందగమనానికి దారితీయొచ్చనే ఆందోళనలు ప్రపంచ స్టాక్‌మార్కెట్లను వణికించాయి.

Read Also : విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870