అంతర్జాతీయంగా ముఖ్యంగా పశ్చిమాసియా (Middle East) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మార్కెట్లో ఇంధన కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) ప్రజలకు కీలకమైన భరోసా ఇచ్చారు. ఎల్పీజీ (LPG) సరఫరా గురించి ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తప్పుడు వార్తలను నమ్మి పానిక్ బయింగ్ (కంగారుగా వస్తువులను కొని నిల్వ చేయడం) చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంక్షోభం ఉన్నా భారత్ సిద్ధం ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మంత్రి గోయల్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ (సరఫరా గొలుసు) దెబ్బతిన్నప్పటికీ, భారత్ అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వాణిజ్యం, లాజిస్టిక్స్లో అనిశ్చితిని సృష్టిస్తాయన్న మాట వాస్తవమే అయినా, దేశీయ మార్కెట్పై దాని ప్రభావం పడకుండా ప్రభుత్వం తగినన్ని నిల్వలను ముందే సమకూర్చుకుందని ఆయన తెలిపారు.
Read Also: Nitish Kumar Resignation: నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

కంగారు పడి వస్తువులను నిల్వ చేయాల్సిన అవసరం లేదు
పానిక్ బయింగ్తోనే అసలు సమస్య చాలామంది ప్రజలు భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయని లేదా స్టాక్ అయిపోతుందని భావించి అదనపు సిలిండర్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీనిపై గోయల్ హెచ్చరిస్తూ.. “ప్రజలు కంగారు పడి వస్తువులను నిల్వ చేయాల్సిన అవసరం లేదు. గృహ అవసరాలకు , పరిశ్రమలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు మన వద్ద ఉన్నాయి” అని చెప్పారు. ఇలా అనవసరంగా నిల్వ చేయడం వల్ల మార్కెట్లో అసమతుల్యత ఏర్పడి, నిజంగా అవసరమైన వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరంతర పర్యవేక్షణ , వ్యూహాలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఇంధన మార్కెట్లు , సముద్ర రవాణా మార్గాలపై ఈ ఉద్రిక్తతల ప్రభావం ఎంతవరకు ఉందో అధికారులు నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. ఒకవేళ సంక్షోభం మరింత పెరిగితే, ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవడం లేదా కొనుగోలు వ్యూహాలను మార్చుకోవడం వంటి ప్లాన్-బి సిద్ధంగా ఉందని గోయల్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: