అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ (AI-171) ప్రమాదం పై దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా, ముంబైలో ముగ్గురు అనుభవజ్ఞులైన పైలట్లు ఈ ఘటనను రీక్రియేట్ చేశారు. దీనికోసం వారు ‘సిమ్యులేటెడ్ ఫ్లైట్’ సాంకేతికతను ఉపయోగించారు. అంటే అసలు విమానం ఎలా పని చేస్తుందో అదే తరహాలో అన్ని పరిస్థితులను మలచి, అచ్చు అదే విధంగా ప్రయోగాత్మకంగా నిర్వహించారు.
ప్రమాదానికి కారణమైన ముఖ్య అంశాలు
ఈ సిమ్యులేషన్లో పైలట్లు బోయింగ్ విమానం బరువు, ల్యాండింగ్ గేర్, ఫ్లాప్స్ వంటి ముఖ్యమైన పారామీటర్లను అనుకరించారు. ఇందులో ప్రత్యేకంగా రెండు ఇంజిన్ల ఫెయిల్యూర్ జరిగినట్టు ప్రదర్శించి, అదే కారణంగా విమానం ప్రమాదానికి (air india plane crash) గురైందేమో అన్న అనుమానంపై దృష్టిసారించారు. రన్వే వద్ద ఇంజిన్ల ఆగిపోవడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ సరిగా జరగకపోవచ్చని నిపుణుల అభిప్రాయం.
బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ కొనసాగుతోంది
ఇప్పటికే అధికారిక దర్యాప్తు కమిటీ తన పరిశోధన కొనసాగిస్తుండగా, ఈ రీక్రియేషన్ ద్వారా అదనంగా తేల్చుకోవలసిన అంశాలను గుర్తించాలన్నదే లక్ష్యం. నిపుణులు బ్లాక్ బాక్స్ డేటాను సేకరించి, ప్రయాణ సమయంలో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అధ్యయనం చేస్తున్నారు. పైలట్లు తీసుకున్న నిర్ణయాలు, సాంకేతిక లోపాల మధ్య సంబంధాన్ని గమనించి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also : Bandh : తెలంగాణ లో రేపు, ఎల్లుండి కాలేజీల బంద్ కు PDSU పిలుపు