📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Supreme Court : మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ పిటిషన్ కొట్టివేత

Author Icon By sumalatha chinthakayala
Updated: April 1, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Supreme Court : సుప్రీంకోర్టు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాక..సబర్మతి ఆశ్రమం ఆధునికీకరణ అంశం భావోద్వేగాలతో ముడిపెట్టొద్దని సూచించింది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని రూ.1200కోట్లతో ఆధునికీకరించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని 2022లో గుజరాత్ హైకోర్టు సమర్థించింది. అయితే తుషార్‌ గాంధీ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మీ భావోద్వేగాలను ఈ అంశంతో ముడిపెట్టవద్దు

గుజరాత్ ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టు ఆశ్రమం టోపోగ్రఫీ మారిపోతుందని నైతికత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ భావోద్వేగాలను ఈ అంశంతో ముడిపెట్టవద్దు. మనం ముందుకు వెళ్తున్నాం. ఈ దేశం ముందుకు వెళ్తోంది. ఇలాంటి అంశాలను ఇతర కోణాల్లో చూడాలి అని కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాము అన్ని అంశాలను పరిశీలించామని, అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించింది.

ఈ ప్రణాళికలో 40 పురాతన కట్టడాలను మాత్రమే

కాగా, గుజరాత్ ప్రభుత్వం 2019లో సబర్మతి ఆశ్రమాన్ని ప్రపంచ స్థాయి మ్యూజియం మరియు పర్యాటక గమ్యంగా మార్చేందుకు పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికలో 40 పురాతన కట్టడాలను మాత్రమే ఉంచి, మిగతా 200 నిర్మాణాలను కూల్చి పార్కులు, పార్కింగ్ స్థలాలు, ఫలహారశాల, చంద్రభాగ నది ప్రవాహ పునరుద్ధరణ వంటి అంశాలను చేర్చాలని సూచించారు. తుషార్ గాంధీ ఈ ప్రణాళికను గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా, ఆశ్రమం సహజత్వాన్ని హానికరంగా భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mahatma Gandhi great-grandson Paper Telugu News petition Supreme Court Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Tushar Gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.