Pension News: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు వార్తలపై కేంద్రం వివరణ

Read Time:  1 min
Pension News
Pension News
FONT SIZE
GET APP

Pension News: ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం పై ఇటీవల వెలువడిన సమాచారంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లలో అయోమయం నెలకొంది. జీతాల సవరణలు, డీఏ పెంపు, పెన్షన్ మార్పులు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచారాలు ఊపందుకున్నాయి. దీంతో లక్షలాది మంది పెన్షనర్లు ఆందోళన చెందారు.

Read Also: Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

డీఏ, డీఆర్‌పై కోతలేదని కేంద్రం స్పష్టీకరణ

కొన్ని వైరల్ సందేశాల్లో ఆర్థిక చట్టం–2025(Finance Act–2025) ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపులు నిలిపివేశారని, అలాగే భవిష్యత్తులో 8వ వేతన సంఘం ప్రయోజనాలు పెన్షనర్లకు వర్తించవని తప్పుడు వాదనలు ప్రచారం అయ్యాయి. ఈ ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ అధికారిక వాస్తవ నిర్ధారణ సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టంగా ఖండించింది.

Central Government Pensioners
Pension News: Center clarifies on news of pension cancellation for government employees

పెన్షనర్లకు సంబంధించిన డీఏ, డీఆర్ లేదా వేతన సంఘ సిఫార్సులపై ప్రభుత్వం ఎలాంటి కోతలు పెట్టలేదని పీఐబీ వెల్లడించింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అన్ని ప్రయోజనాలను యథావిధిగా పొందుతారని తెలిపింది. భవిష్యత్తులో 8వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా పెన్షన్ సవరణలు అమలు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో డీఆర్ పెంపులు కొనసాగుతాయని పేర్కొంది.

పీఎస్‌యూలలో విలీనమైన ఉద్యోగులు

ఈ గందరగోళానికి కారణమైన CCS (Pension) నియమాలు–2021లోని పరిమిత సవరణలు సాధారణ పెన్షనర్లకు వర్తించవని పీఐబీ వివరించింది. ప్రభుత్వ సేవల నుంచి తొలగించబడి అనంతరం పీఎస్‌యూలలో విలీనమైన ఉద్యోగులు లేదా తీవ్రమైన క్రమశిక్షణా లోపాలకు పాల్పడిన కేసుల్లో మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ సవరణ భారత సుప్రీంకోర్టు ఇచ్చిన సూరజ్ ప్రతాప్ సింగ్ వర్సెస్ CMD, BSNL తీర్పు ఆధారంగా తీసుకొచ్చినదని తెలిపింది.

ఈ అంశంపై పార్లమెంటులో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ప్రశ్నకు సమాధానంగా, 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్లు కూడా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జీతాలు, అలవెన్సులు, పెన్షన్లపై సమగ్ర సిఫార్సులు చేయడమే వేతన సంఘం ప్రధాన బాధ్యత అని సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి(Finance Minister Pankaj Chaudhary) తెలిపారు. డీఏ, డీఆర్‌ను ప్రాథమిక వేతనంలో విలీనం చేసే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని, 2027 నాటికి వేతన సంఘ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

మొత్తంగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ సందేశాలు పూర్తిగా తప్పుదారి పట్టించేవని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. పెన్షనర్లు పుకార్లకు లోనుకాకుండా అధికారిక ప్రకటనలనే నమ్మాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.