భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ వరుసగా దాడులు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్కు చెందిన కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషేరా వంటి సెక్టార్లలో పాక్ రేంజర్లు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడుతున్నారు. సరిహద్దు చెకోపోస్టుల వద్ద పదే పదే ఉల్లంఘనలు చేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి.
పాక్ రేంజర్లు కాల్పులు
గత 10 రోజులుగా ఈ కాల్పులు కొనసాగుతుండటం గమనార్హం. పాక్ రేంజర్లు నిరుద్దేశంగా కాల్పులు జరుపుతుండగా, భారత సైన్యం మాత్రం అత్యంత సామర్థ్యంతో, మితంగా కానీ దీటుగా ప్రతిస్పందిస్తోంది. తమ భద్రతా సిబ్బందికి హాని కలిగించకుండా, సివిలియన్ జనాభాకు ప్రమాదం లేకుండా చర్యలు చేపడుతోంది. భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
భారత్ భద్రతకు సవాలు
ఈ తరహా రెచ్చగొట్టింపు చర్యలు భారత్ భద్రతకు సవాలుగా మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఈ చర్యల వెనుక దాని అంతర్గత రాజకీయ అస్తవ్యస్థలు, అంతర్జాతీయ దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలే కారణమవచ్చని భావిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, అవసరమైతే మరింత గట్టి చర్యలు తీసుకోవాలని పరిశీలిస్తోంది. ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మరింత బలోపేతం చేయాలని కేంద్రం ఆదేశించింది.
Read Also : NET Exam : దేశవ్యాప్తంగా నేడే నీట్ ఎగ్జామ్