భారత్-పాకిస్థాన్ సరిహద్దు మరోసారి హోరాహోరీగా మారింది. ఉదయం నుంచే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పాకిస్థాన్ పది నుంచి పదిహేను నగరాలపై భారత డ్రోన్ దాడులు జరిగాయి.ఇవన్నీ “ఆపరేషన్ సిందూర్” కొనసాగింపులో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఈ దాడులపై గమనిస్తుండగా, పాక్ కూడా సమాధానంగా రాకెట్లు, మిస్సైళ్లు ప్రయోగించింది.వాటిలో కొన్ని అమృత్సర్ పరిసరాల్లో పడినట్టు సమాచారం. అయితే భారత భద్రతా బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.రాత్రి సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చీకటి పడిన తర్వాత పాకిస్థాన్ దాడులను పెంచింది. లక్ష్యం – జమ్ముకశ్మీర్ ప్రాంతాలు ,పాకిస్థాన్ దాడులను అంచనా వేసిన భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్ము, అక్నూర్ ప్రాంతాల్లో వెంటనే సైరన్లు మోగించాయి.ఆర్మీ సైరన్ అంటే ప్రజలు అలర్ట్లోకి వెళ్లాల్సిన సంకేతం.

“ఇది సాధారణం కాదు, మిమ్మల్ని రక్షించుకోండి” అన్న హెచ్చరికలా మారింది.ఇప్పటి వరకు జరిగిందేమిటంటే – పాకిస్థాన్ దాడులు పెరిగాయి. భారత సైన్యం సమాధానంగా ప్రతీకార దాడులు చేస్తోంది. ఇది కేవలం మొదటి దశగా భావిస్తున్నారు.జమ్ము ఎయిర్పోర్ట్ చుట్టూ భారీ బలగాలు మోహరించాయి. ఎస్-400 వాయు భద్రతా వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడి ఫైటర్ జెట్లు రెడీగా ఉన్నట్టు సమాచారం.ఇప్పటికే పాక్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో పూర్తి బ్లాక్అవుట్ అమల్లో ఉంది. దీని వల్ల వార్తలు బయటకు రావడం కష్టంగా మారుతోంది.ఇదే సమయంలో పాక్ దాడుల తీవ్రతపై కేంద్రం సమీక్ష నిర్వహిస్తోంది.
రాత్రి భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.అంతర్జాతీయంగా ఈ ఉద్రిక్తతపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా, యూఎన్ తదితర దేశాలు శాంతి పిలుపునిస్తూ స్పందిస్తున్నాయి.కాని భారత్ తరపున స్పష్టమైన సంకేతం ఇచ్చింది – ప్రజల భద్రతకు మేము రాజీపడం. చల్లదనాన్ని కోరుకుంటాం, కానీ తలదన్నితే వెనక్కి వెళ్లం.పాక్ చర్యలపై జాగ్రత్తగా, కూలంకషంగా స్పందిస్తోంది భారత సైన్యం. ముందు జాగ్రత్త చర్యలతో ప్రజల్ని రక్షించడమే లక్ష్యం.రాబోయే గంటలు నిర్ణయాత్మకంగా మారవచ్చు. మరోసారి సరిహద్దు ప్రాంతం మంటల్లోకి వెళ్లకూడదని ప్రతి భారతీయుడు ఆశిస్తున్నాడు.
Read Also : Vyomika Singh : మరోసారి మీడియా ముందుకు వచ్చిన వ్యోమికా సింగ్